రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో సీఐ సతీష్ జోక్యం చేసుకోవటంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సతీష్.. సివిల్ కేసు వివాదంలో ఇన్వాల్వ్ అయినట్లు విచారణలో తేలటంతో సస్పెండ్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఇద్దరు సీఐలను సస్పెండ్ అయ్యారు. భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని చితకబాదిన కేసులో కేపీ హెచ్ బీ సీఐ వెంకట్ ను , మరో కేసులో సరిగా విచారణ చేయనందుకు ఎయిర్ పోర్ట్ సీఐ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.