
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని వజిరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశ ఆర్మీ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. ‘‘వజిరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్ను నిందిస్తూ పాక్ ఆర్మీ చేసిన ప్రకటన మా దృష్టికి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అంటూ విదేశాంగ శాఖ ఆదివారం (జూన్ 29) ఓ ప్రకటన విడుదల చేసింది.
దాన్ని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కాగా, పాక్ ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్లోని వజిరిస్తాన్లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. సూసైడ్ బాంబర్ ఆర్మీ కాన్వాయ్ని ఢీకొట్టడంతో పేలుడు సంభవించి 13 మంది సైనికులు మరణించారు. మరో 10 మంది సోల్జర్లు, 19 మంది జనం గాయపడ్డారు. ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాక్ ఆర్మీ ఆరోపణలు చేసింది.