పాక్లో వరదలు.. ఏడుగురు మృతి ..11 మంది గల్లంతు..

పాక్లో వరదలు.. ఏడుగురు మృతి ..11 మంది గల్లంతు..
  • అంతా ఒకే ఫ్యామిలీ..కొనసాగుతున్న సెర్చ్​ ఆపరేషన్​

పెషావర్: పాకిస్తాన్‌‌‌‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తూన్‌‌‌‌ఖ్వా ప్రాంతంలోని స్వాత్  నదికి వరద పోటెత్తింది. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. ఇందులో ఏడుగురి మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మిగతా 11 మంది ఆచూకీ కోసం నదిలో గాలిస్తున్నారు.

 శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఫిజాగత్ ప్రాంతంలో మింగోరా బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సియాల్ కోట్ నుంచి వచ్చిన ఈ కుటుంబం నది ఒడ్డున భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో కుటుంబంలోని మొత్తం 18 మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు.

 గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా స్వాత్ నదిలో అకస్మాత్తుగా వరద పెరిగింది. దీనివల్ల నీటి ప్రవాహం ఉధృతమై ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. సుమారు 80 మంది రెస్క్యూ సిబ్బంది ఐదు వేర్వేరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పాక్ ​ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.