గురునానక్ స్మారక నాణేన్ని విడుదల చేసిన పాక్

గురునానక్ స్మారక నాణేన్ని విడుదల చేసిన పాక్

గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం రూ.50 విలువైన గురునానక్ స్మారక నాణేన్ని విడుదల చేసింది. దీంతోపాటు 8 రూపాయల విలువ చేసే పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేసింది. వీటిని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించే యాత్రికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇటీవల ప్రారంభమైన కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా 575 మంది భారత యాత్రికులు గురుద్వారా కర్తార్‌పూర్‌ను సందర్శించనున్నారు. వచ్చే నెల 9న ఈ బృందం పాక్ కు బయలుదేరనుంది. వీరికి సంబంధించిన లిస్టును భారత సర్కారు ఇప్పటికే పాకిస్తాన్ కు అందజేసింది.