పదేళ్ల తర్వాత పాక్‌‌‌‌ గడ్డపై టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌

పదేళ్ల తర్వాత పాక్‌‌‌‌ గడ్డపై టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌

లాహోర్‌‌‌‌: దాదాపు పదేళ్ల తర్వాత పాకిస్థాన్‌‌‌‌ గడ్డపై ఓ ఇంటర్నేషనల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ జరగబోతుంది. వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో భాగంలో పాక్‌‌‌‌లో రెండు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ఆడేందుకు శ్రీలంక గురువారం అంగీకారం తెలిపింది. డిసెంబర్‌‌‌‌ 11న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ రావల్పిండిలో, సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కరాచీలో జరుగుతుంది. 2009లో లాహోర్‌‌‌‌లో టెర్రరిస్ట్‌‌‌‌ అటాక్‌‌‌‌కు గురైన లంక జట్టు చివరిగా పాక్‌‌‌‌లో టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడింది. గత నెలలో పాక్​లో  టీ20, వన్డే సిరీస్‌‌‌‌లు ఆడిన లంక మళ్లీ టెస్ట్‌‌‌‌ల కోసం రానుంది.

Pakistan to Play Home Tests Against Sri Lanka for First Time in Decade