గాలె: పాకిస్తాన్తో ఆదివారం మొదలైన రెండో టెస్ట్లో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. దినేశ్ చండిమల్ (80), ఒషాడ ఫెర్నాండో (50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 315/6 స్కోరు చేసింది. డిక్వెల్లా (42 బ్యాటింగ్), దునిత్ వెల్లలాగే (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంకకు ఓపెనర్లు కరుణరత్నె (40), ఫెర్నాండో తొలి వికెట్కు 92 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు.
కుశాల్ మెండిస్ (3) నిరాశపర్చినా, మిడిలార్డర్లో మాథ్యూస్ (42) నిలకడగా ఆడాడు. చండిమల్తో కలిసి నాలుగో వికెట్కు 75 రన్స్ జోడించి ఔటయ్యాడు. చివర్లో ధనంజయ్ డిసిల్వా (33) కూడా సమయోచితంగా రాణించాడు. పాక్ బౌలర్లలో నవాజ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో లంక తరఫున 19 ఏళ్ల దునిత్ అరంగేట్రం చేశాడు.