ప్రపంచం ముందు నవ్వులపాలైన పాకిస్తాన్: పాత మ్యాచ్ హైలైట్స్ చూసి గెలిచినట్లు సంబరాలు

ప్రపంచం ముందు నవ్వులపాలైన పాకిస్తాన్: పాత మ్యాచ్ హైలైట్స్ చూసి గెలిచినట్లు సంబరాలు

ఆసియా కప్ 2023లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 266 పరుగులు చేయగా.. పాక్‌ బ్యాటర్లు అసలు మైదానంలోకే రానివ్వకుండానే వర్షం ముంచెత్తింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఫలితం తేలకుండానే ముగిసింది. 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దాయాదుల పోరు ఇలా ఫలితం తేలలేదని కోట్లాది మంది అభిమానులు ఒకవైపు నిరుత్సాహ పడుతుంటే.. పాకిస్తానీ సోదరీమణులు మాత్రం ఈ మ్యాచ్‌లో వారి జట్టు గెలిచిందనుకొని సంబరాలు చేసుకున్నారు. వాస్తవానికి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన విషయం వారికి తెలియదు. అది తెలియక ఒకప్పటి మ్యాచ్ హైలైట్స్ చూసి తెగ ఆనంద పడిపోయారు. గతేడాది జరిగిన ఆసియా కప్ 2022 సూపర్ 4 దశలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తుచేసిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని.. పాక్ ఒక బంతి మిగిలివుండగానే చేధించింది. 

ఆ మ్యాచ్ హైలైట్స్ టీవీలో రాగా.. వారు ఇప్పటి మ్యాచ్ అనుకొని చాలా ఆసక్తిగా తిలకించారు. బంతి బౌండరీకి వెళ్లినప్పుడల్లా సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ గెలిచింది.. మనమేమో పడుకొని నిద్రపోయాం.. చక్కా.. చక్కా .. అంటూ కేరింతలు కొట్టారు. అయితే చివరలో ఒక యువతి.. అవి ఒకప్పటి మ్యాచ్ హైలైట్స్, నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.. అని చెప్పగా ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతయ్యింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

పాకిస్తానీ సోదరీమణుల అమాయకత్వాన్ని చూసి నెటిజెన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మీలాంటి ఉండబట్టే పాకిస్తాన్ పరిస్థితి ఇలా అయ్యిందంటూ వారిని ఆట పట్టిస్తున్నారు.