ఢిల్లీలో పాక్ టెర్రరిస్టు అరెస్టు

ఢిల్లీలో పాక్ టెర్రరిస్టు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ టెర్రరిస్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఆ ఉగ్రవాదిని పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ అస్రఫ్‌గా గుర్తించారు పోలీసులు. అతడు ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫేక్ ఐడీతో పలు సిటీలో నివాసం మారుస్తూ వచ్చినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. అతడిని అరెస్టు చేసిన సమయంలో ఏకే 47 గన్‌తోపాటు ఓ హ్యాండ్ గ్రెనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మౌలానా అనే మారుపేరుతో ఢిల్లీ సహా పలు  సిటీల్లో అస్రఫ్ నివసించినట్లు విచారణలో తేలింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐతో అతడు టచ్‌లో ఉన్నాడని సమాచారం.

మరిన్ని వార్తలు: 

భార్య ఆస్తి కొట్టేయాలని త్రాచుపాముతో కాటేయించాడు

నా రాజీనామా వెనక బలమైన రీజన్ ఉంది: ప్రకాశ్ రాజ్

క్వారంటైన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన శ్రియ