
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అద్భుత ప్రతిభతో పతకాలు సాధిస్తున్నారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ ఈవెంట్లో షూటర్ పాలక్ స్వర్ణం, ఈషా సింగ్ రజతం సాధించారు. పాలక్ షూటింగ్లో సాధించిన స్వర్ణంతో 6వ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకోవడం ద్వారా భారత్ మొత్తం ఎనిమిది బంగారు పతకాలను సాధించింది. పాలక్ 242.1 స్కోరుతో ఆసియా క్రీడల రికార్డును కూడా బద్దలు కొట్టింది.