కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి

కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి

కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీకి ఆలయ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి ఫొటోతో సత్కరించారు.

ఈ సందర్భంగా పల్లా మీడియాతో మాట్లాడారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు తెలిపారు. కొమురవెల్లి నుంచి చేర్యాల మీదుగా జనగామకు భారీ కాన్వాయ్ తో ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో సర్పంచ్ సార్ల లత, ఉపసర్పంచ్ కొండ శ్రీధర్, ఎంపీపీలు తలారి కీర్తన బదిపడిన కృష్ణారెడ్డి, కర్ణాకర్లు, జడ్పీటీసీ సిద్ధప్ప, బీఆర్ఎస్ నాయకులు గొల్లపల్లి కిష్టయ్య, సార్ల కిష్టయ్య, ముత్యం నర్సింహులు, నాగమల్ల భిక్షపతి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.