- బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసినవారు ఎన్నికైనా ఏం చేయలేరు
- మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట రూరల్/మెదక్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామానికి రూ. 25 లక్షల నిధులు ఇస్తానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హామీ ఇచ్చారు. శనివారం సిద్దిపేట టౌన్, మెదక్ టీఎన్జీఓ భవన్లో ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారు. సర్పంచ్ పదవి కోసం రూ. లక్షల్లో వేలం పాటలు పాడుతూ డబ్బులు వెదజల్లుతున్నారన్నారు. వేలంలో సర్పంచ్ పదవిని కొనుక్కోవడమంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని విమర్శించారు.
ఇలాంటి వాటిని ఎంకరేజ్చేయొద్దన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నేరుగా పంచాయతీల అకౌంట్లలోకి డబ్బులు పంపిస్తోందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3500 కోట్ల నిధులు ఎక్కడ ఆగిపో తాయనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తోందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద పైసల్లేవని, బీజేపీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలిస్తేనే కేంద్రం నుంచి నిధులు వచ్చి పంచాయతీల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్ఎస్మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలిచినా ఏమి చేయలేరన్నారు.
ఆయా సమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లేశ్గౌడ్, అధ్యక్షుడు బైరి శంకర్, రంజిత్రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ బాసం గారి వెంకట్, నాయకులు విజయ్, రాంచంద్రం, మార్కండేయులు, ప్రసాద్, కాశీనాథ్, మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
