మిడ్​డే మీల్స్​లో పురుగులు

మిడ్​డే మీల్స్​లో పురుగులు

గండీడ్, వెలుగు: గండీడ్  మండలం వెన్నచెడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తినకుండా పడేసి, పేరెంట్స్​కు ఈ విషయాన్ని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఎంను నిలదీయడంతో, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 

టీచర్ల పర్యవేక్షణ లోపంతోనే ఇలా పురుగులు వచ్చాయని పేరెంట్స్​ వాపోయారు.