
- మారుతున్న పేరెంట్స్ ఆలోచన ధోరణి
- హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్కు ఇంపార్టెన్స్
- సిటీలోని అకాడమీల్లో స్టూడెంట్స్ ఫుల్
హైదరాబాద్, వెలుగు: చదువు, ఇల్లు, ట్యూషన్, మార్కులు, ర్యాంకులు ఇవే పిల్లల లైఫ్. ఇది కొంతకాలం కిందటి మాట. పిల్లల యాక్టివిటీ మారుతుంది. పేరెంట్స్ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు. స్పోర్ట్స్ కూడా మస్ట్ అని భావిస్తున్నారు. ఆటలు శారీరక, మానసిక వృద్ధికే కాకుండా కెరీర్కు కూడా ప్లస్ అవుతుండగా స్పోర్ట్స్ కు కూడా ఇంపార్టెన్స్ఇస్తున్నారు. స్కూళ్లలో సరైన ప్లే గ్రౌండ్స్ లేక వేలల్లో ఫీజులు కట్టి ప్రైవేట్ అకాడమీల్లో పిల్లలకు ఏదో ఒక స్పోర్ట్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కొంతకాలంగా సిటీలోని స్పోర్ట్స్అకాడమీలు స్టూడెంట్స్తో నిండిపోతున్నాయి. ఒక్కో అకాడమీలో వందల సంఖ్యలో స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ కనిపిస్తున్నారు.
టెక్నాలజీ పెరుగుతుండగా...
ఆటలపై పేరెంట్స్ కు సరైన అవగాహన లేకుండే. కొన్నేండ్ల నుంచి ప్రయార్టీ ఇస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతుండటం, పిల్లలు టీవీలు, మొబైల్స్ కు అతుక్కుపోతుండడం, సోషల్మీడియాపై ఆసక్తి చూపుతుండడం గమనిస్తున్న పేరెంట్స్ ఫిజికల్గేమ్స్వైపు పిల్లల దృష్టి మళ్లిస్తున్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ పై శ్రద్ధ పెరిగింది. పిల్లలను కూడా హెల్దీగా, ఫిజికల్గా ఫిట్గా ఉంచాలని పేరెంట్స్నిర్ణయించుకుంటున్నారు. స్పోర్ట్స్ లో ఉన్న పిల్లలు మిగతా వారికంటే చాలా చురుకుగా, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కెరీర్పరంగా కూడా స్పోర్ట్స్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక కోటాలో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. పీవీ సింధు, నిఖత్ జరీన్ లాంటి స్పోర్ట్స్ఉమన్స్కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కూడా పేరెంట్స్ఆలోచనల్లో మార్పు రావడానికి కారణంగా చెప్పవచ్చు. మరికొందరు పిల్లల ఇష్టా అయిష్టాలను గుర్తించి వారి కేరీర్నే పూర్తిస్థాయిలో స్పోర్ట్స్ వైపు మళ్లిస్తున్నారు.
అకాడమీల్లో సందడిగా..
కొన్నేండ్లుగా సిటీలోని స్పోర్ట్స్అకాడమీలు స్టూడెంట్స్తో నిండిపోతున్నాయి. చాలా స్కూళ్లలో గ్రౌండ్స్, పీఈడీలు లేకపోవడం, స్పోర్ట్స్కు సరైన ప్రయార్టీ ఇవ్వకపోవడంతో అకాడమీల్లో జాయిన్ చేస్తున్నారు పేరెంట్స్. క్రికెట్, టెన్నిస్, స్విమ్మింగ్, సైక్లింగ్, రెజ్లింగ్, స్కేటింగ్,కరాటే, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ... తదితర ఆటల్లో ట్రైనింగ్ తీసుకునేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో అకాడమీలో వందల సంఖ్యలో ఉన్నారు. గర్ల్స్, బాయ్స్ అనే తేడా లేకుండా స్పోర్ట్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఆయా గేమ్స్, అకాడమీలను బట్టి నిర్వాహకులు వేలల్లో ఫీజులను వసూలు చేస్తున్నారు. ఒక్కో అకాడమీలో క్రికెట్ కు 2,500 నుంచి తీసుకుంటున్నారు. మార్నింగ్, ఈవెనింగ్సెషన్స్ కు వచ్చే వారికి రెట్టింపు ఫీజు వసూలు చేస్తున్నారు.
పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుంది
పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా అవసరం. వారిలో ఆటలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మా ఇద్దరమ్మాయిలు స్పోర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మార్నింగ్గేమ్స్ ఆడితే.. పిల్లలు రోజంతా యాక్టివ్గా, హెల్తీగా ఉంటారు. చదువులో కూడా మిగతా వారితో పోల్చితే చురుకుగా ఉంటారు.
– హరిబాబు, పేరెంట్, బాలాపూర్
చిన్న ఏజ్లోనే ఆడితే..
కొన్నేండ్లుగా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది. గతంలో సైక్లింగ్ లో 150 మంది స్టేట్స్వెళితే.. ఇటీవలే 250 మంది వెళ్లారు. రెగ్యులర్గా స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనడం ద్వారా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. స్టామినా కూడా పెరుగుతుంది. ఆనారోగ్య సమస్యలు కూడా రావు. చిన్నప్పటి నుంచే స్పోర్ట్ లో ఉంటే బ్రైట్ప్యూచర్ఉంటుంది.
– విజయ్ భాస్కర్ రెడ్డి, సైక్లింగ్కోచ్, స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఓయూ
స్పోర్ట్స్ను కెరీర్ గా ఎంచుకుంటూ..
అకాడమీకి వచ్చే స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది. గతంలో సమ్మర్లోనే ఎక్కువ మంది జాయిన్ అయ్యేవారు. కానీ కొన్నేండ్లుగా కాలంతో సంబంధం లేకుండా వస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ స్పోర్ట్స్ను కెరీర్ గా ఎంచుకుంటున్నారు.
– రమేశ్, డీబీఆర్ స్పోర్ట్స్అకాడమీ, తెల్లాపూర్