కూతురి కళ్లెదుటే తల్లిదండ్రుల సజీవ దహనం

కూతురి కళ్లెదుటే తల్లిదండ్రుల సజీవ దహనం

జోగిపేట, వెలుగు: కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్యకు యత్నించగా కాపాడబోయి భర్త సైతం మృతిచెందాడు. 14 ఏళ్ల కూతురు కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లేష్(40), సునీత(35) దంపతులకు ఒక కూతురు(14) ఉంది. ఎల్లేష్​ వ్యవసాయం చేస్తుంటాడు. ఎల్లేష్ మద్యానికి బానిసవడంతో మద్యం మానేయమంటూ భార్య గతంలో అనేకసార్లు హెచ్చరించింది. పలుసార్లు ఆత్మహత్యకు యత్నించింది. కానీ భర్త మాత్రం మద్యం మానలేదు. బుధవారం రాత్రి ఎల్లేష్ మద్యం తాగి రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్తకు  కూడా మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న కూతురు తీవ్ర భయాందోళనకు గురై మంచం కింద దాక్కుని కేకలు వేసింది. చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకుని తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పివేశారు. ఇద్దరిని 108లో హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరూ మృతిచెందారు.

For More News..

డబుల్​ బెడ్​రూం ​ఇండ్లలో అర్ధరాత్రి గృహ ప్రవేశాలు! అడ్డుకున్న ప్రజలు

సాగర్ బైపోల్‌తో నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ.. ఆంధ్రా కంపెనీకి కాంట్రాక్ట్

వ్యాక్సిన్ తర్వాత 30 నిమిషాలు అక్కడే రెస్ట్‌‌.. రియాక్షన్స్‌‌ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్

వరస్ట్​ సీఎంలలో కేసీఆర్‌కు 4వ ప్లేస్‌