కూతురుతో కలిసి చుట్టాలింటికి.. తల్లిదండ్రులిద్దరిపై కేసు

కూతురుతో కలిసి చుట్టాలింటికి.. తల్లిదండ్రులిద్దరిపై కేసు

భావ్ నగర్: కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిన నాలుగేళ్ల బాలిక తల్లిదండ్రులపై పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నప్పటికీ వారు ఆమెతోపాటు టూవీలర్​పై రిలేటివ్స్ ఇంటికి వెల్లారని తేలిందని, అందుకే కేసు ఫైల్ చేశామని గుజరాత్ పోలీసులు ఆదివారం మీడియాకు తెలిపారు. జామ్నాకుండ్ ప్రాంతంలోని క్లస్టర్ జోన్ లో నివాసం ఉండే బాలిక తండ్రి తన కూతురు, భార్యతో కలిసి శనివారం రిలేటివ్స్ ఇంటికి వెళ్లారని, చెక్ పోస్టు వద్ద తాను గవర్నమెంట్ అఫీషియల్ నని చెప్పి వెళ్లాడని తెలిపారు. ఆ మరుసటి రోజు నిర్వహించిన టెస్టుల్లో అతని కూతురికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని, చిన్నారిని ఐసోలేషన్ కు తరలించినట్లు భావ్ నగర్ అధికారులు వెల్లడించారు. చిన్నారి తల్లిదండ్రులపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్టు కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.