10 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పరిగి ఎస్ఐ

10 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పరిగి ఎస్ఐ

రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
వికారాబాద్​ జిల్లా, వెలుగు :  లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్​ఐ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన ఘటన జిల్లాలోని పరిగి టౌన్​లో గురువారం జరిగింది. మండల పరిధిలోని సయ్యద్​ పల్లికి చెందిన భూమన్నగారి సాయిరెడ్డి, మాదని సురేష్​ కు మధ్య కొద్దిరోజుల కిందట ఆలయ పూజలకు సంబంధించి గొడవలు జరిగాయి.  దీనికి సంబంధించి వాట్సప్​గ్రూప్​లో​వైరల్​గా మారింది.  భూమన్నగారి సాయిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితుడైన మాదని సురేష్​ పరిగి పోలీసులకు కంప్లయింట్​ చేశాడు. గ్రామ పెద్దలు, పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. అట్రాసిటీ కేసు నుంచి తప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని పరిగి ఎస్ఐ పాటిల్​ క్రాంతికుమార్​ రూ. 10 వేలు లంచం ఇవ్వాలని సాయిరెడ్డిని డిమాండ్​ చేశాడు. అతడు ఏసీబీ పోలీసులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం సాయిరెడ్డి నుంచి ఎస్ఐ క్రాంతికుమార్​లంచం డబ్బు తీసుకుంటుండగా ​రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుని కేసు నమోదు చేశామని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.