వీడియో కాన్ఫరెన్స్​లో పార్లమెంట్​ కమిటీల మీటింగ్స్!

వీడియో కాన్ఫరెన్స్​లో పార్లమెంట్​ కమిటీల మీటింగ్స్!
  • సాధ్యాసాధ్యాలు పరిశీలించండి: వెంకయ్య, ఓం బిర్లా
  • రాజ్యసభ, లోక్​సభ సెక్రెటరీ జనరల్స్​కు ఆదేశం

న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీల మీటింగ్స్​ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించే ప్రయత్నాలు సాగుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్​ మీటింగ్స్​పై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని రెండు సభల సెక్రెటరీ జనరల్స్​ను రాజ్యసభ చైర్మన్​ ఎం.వెంకయ్యనాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ఆదేశించారు. లాక్​డౌన్​ కారణంగా ఎంపీలంతా ఇండ్లకే పరిమితం కావడంతో పార్లమెంట్​ కమిటీల మీటింగ్స్​ పెండింగ్​లో పడిపోయాయి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మీటింగ్స్​ పెట్టాలని పలువురు ఎంపీలు లోక్​సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్​ను కోరారు. గురువారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాస్​లో సమావేశమైన వెంకయ్య, ఓం బిర్లా.. పార్లమెంటరీ కమిటీల మీటింగ్స్​పై చర్చించారు. రెగ్యులర్​ మీటింగ్స్​ జరిగే పరిస్థితి కనిపించనట్లయితే ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్​ మీటింగ్స్​పై సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్​ ఇవ్వాలని వారు సెక్రెటరీ జనరల్స్​ను ఆదేశించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ తమ నియోజకవర్గాల ప్రజలతో ఎంపీలు కలసి ముందుకెళ్లడంపై ఓం బిర్లా, వెంకయ్య సంతోషం వ్యక్తం చేశారు.