విమానం గాల్లో ఉండగా.. ఎమర్జెన్సీ డోర్​ తెర్వబోయిండు

విమానం గాల్లో ఉండగా..  ఎమర్జెన్సీ డోర్​ తెర్వబోయిండు

ఇండిగో ప్యాసింజర్ ​అరెస్ట్​

గువాహటి: ఇండిగో  విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్​ ఓపెన్​చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఫ్లైట్​లోని ప్యాసింజర్లు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని  త్రిపుర రాజధాని అగర్తలలో ఎయిర్​పోర్ట్​అధికారులు మీడియాకు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం అతడిని అరెస్టు చేసినట్లు  వెల్లడించారు.

నిందితుడు బిశ్వజిత్ దేవ్​నాథ్​ (41) ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్​ను బలవంతంగా ఓపెన్​చేసేందుకు ప్రయత్నించగా విమానంలోని ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకున్నారు. విమానం సిబ్బందితోనూ బిశ్వజిత్​ అమర్యాదగా ప్రవర్తించాడు.  అస్సాంని ​గువాహటి నుంచి అగర్తలకు ఫ్లైట్​ వస్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.