బంగారం స్మగ్లింగ్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది అరెస్ట్

933 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని హైదరాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో ఓ ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ  ప్రయాణికుడి బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేయగా గోల్డ్‌ పట్టబడింది. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110లోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేసి, కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

ALSO READ: అడ్డగుట్టలో పర్మీషన్ లేకుండా 7 ఫ్లోర్లు వేశారు : పరారీలో అపార్ట్ మెంట్ ఓనర్లు