
రైల్వే ప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది రైల్వేశాఖ. అయితే ఈ సారి ఎక్కువగా కాకుండా తక్కువ ఛార్జీలు పెంచింది. పెరిగిన ధరలు జనవరి 1, 2020 నుంచి అమలు కానున్నాయి. ఆర్డినరీలో కి.మీ ఒక పైసా, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ మెయిల్ ఎక్స్ ప్రెస్ లో కి.మీకు రెండు పైసలు..ఏసీ చైర్ కార్, ఏసీ3 టైర్,ఏసీ2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ లాంటి ఏసీల్లో కి.మీ కు 4 పైసలు పెంచింది.

