
డబ్ల్యూటీసీ టోర్నీ వివాదానికి ఆజ్యం పోస్తోంది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతను ఒక్క మ్యాచ్తో తేల్చడం సరికాదన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలకు.. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ కౌంటర్ ఇచ్చాడు. 'మేము ఇప్పటికే డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలిచాం.. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 3 మ్యాచ్ల సిరీస్ కాకపోతే 16 మ్యాచ్ల సిరీస్ నిర్వహించవచ్చు. కానీ ఒలింపిక్స్ ఫైనల్లో కూడా ఒకే మ్యాచ్తో ఆటగాళ్లు పతకాలు సాధిస్తారు అన్నది గుర్తుంచుకోవాలి..' అని కమిన్స్ వ్యాఖ్యానించాడు. కమ్మిన్స్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి పొగరుతో చేసిన వ్యాఖ్యలని కామెంట్స్ చేస్తున్నారు.
మ్యాచ్ ముగిశాక మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్ శర్మ.. 'టెస్ట్ ఫార్మాట్కే వన్నె తెచ్చిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతను ఒక్క మ్యాచ్తో తేల్చడం సరికాదని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అందుకు బదులుగా మూడు మ్యాచ్ల సిరీస్తో విజేతను తేల్చడం సరైన పద్ధతని ఐసీసీకి సూచించాడు.
ఏదేమైనా ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు కాస్త శృతిమించి మాట్లాడినట్లు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక జట్టు సారథిగా(రోహిత్ శర్మ) తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ప్రతి ఆటగాడికి ఉంటుందని.. దానిని గౌరవించాలని ఆస్ట్రేలియా కెప్టెన్కు సూచిస్తున్నారు. కమ్మిన్స్ వ్యాఖ్యలను భారత అభిమానులు కూడా వ్యతికరేకిస్తున్నారు. 'కమ్మిన్స్ వ్యాఖ్యలు.. రోహిత్ను అగౌరవ పరిచేలా ఉన్నాయని..', 'ఆడటానికి చేతకాకే.. ఇలా మూడు మ్యాచ్ల సిరీస్ ప్రతిపాదన..' అన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కమ్మిన్స్ మరోసారి వివరణ ఇస్తారేమో వేచి చూడాల్సిందే.