డివిజన్ల అభివృద్ధికి కృషి.. పటాన్ చెరు నియోజకవర్గంలో GHMC డివిజన్లకు ప్రత్యేక నిథులు

డివిజన్ల అభివృద్ధికి కృషి.. పటాన్ చెరు నియోజకవర్గంలో GHMC  డివిజన్లకు ప్రత్యేక నిథులు

రామచంద్రాపురం, వెలుగు:  పటాన్​చెరు నియోజకవర్గంలోని జీహెచ్​ఎంసీ డివిజన్లను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ముత్తంగి డివిజన్​ పరిధిలోని వెలిమెలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన డివిజన్లలలో మౌలిక సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కాలనీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు.