పటాన్చెరులో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు

పటాన్చెరులో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు
  •     ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్​/పటాన్​చెరు, వెలుగు : రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్​చెరు వేదికగా నిలవనుంది. డివిజన్​ పరిధిలోని మైత్రి మైదానంలో శుక్రవారం నుంచి ఈనెల 30వరకు మూడు రోజుల పాటు 44వ తెలంగాణ అండర్​ 14 ఖోఖో   బాల బాలికల  అంతర్​ జిల్లాల చాంపియన్​షిప్​ పోటీలు జరుగనున్నాయి. 

ఎమ్మెల్యే  గూడెం మహిపాల్​ రెడ్డి సౌజన్యంతో ఖోఖో అసోసియేషన్​ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి. గురువారం ఉదయం మైత్రి మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. 33 జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతితో పాటు టిఫిన్​, భోజనం సదుపాయాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

పటాన్​చెరు క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏడాది పొడవునా వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ పోటీలకు పటాన్​చెరు మైదానాన్ని వేదికగా నిలుపుతున్నామన్నారు. పటాన్​చెరులోని జీఎంఆర్​ కన్వెన్షన్​ సెంటర్​లో శుక్రవారం అయ్యప్ప మహా పడిపూజను నిర్వహిస్తున్నట్లు మాలధారులు, భక్తులు, భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు.