మూడ్రోజుల్లో రూ.313కోట్లు వసూలు చేసిన పఠాన్

మూడ్రోజుల్లో రూ.313కోట్లు వసూలు చేసిన పఠాన్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు రాబట్టింది. ఈ మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.313 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. భారత్ లో మూడో రోజు పఠాన్ రూ.38 కోట్లు రాబట్టగా... ఇప్పటి వరకూ మొత్తం రూ.161కోట్లు వసూలైనట్టు చెప్పారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి మరో రూ.5.75 కోట్లు జమ అయినట్టు పేర్కొన్నారు. దాంతో హిందీలో వచ్చిన మూవీస్ లో పఠాన్ ఫాస్టెస్ట్ కలెక్షన్లు వసూలు చేస్తోందని తెలిపారు. ఇండియాలో రూ.201కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.313 కోట్లు రాబట్టిందని ట్వీట్ లో రాశారు.