
షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 542 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇండియాలో 335 కోట్ల గ్రాస్, ఓవర్ సిస్ లో రూ.307కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్లో తెలిపారు.
ఇక తెలుగు,తమిళంలో పఠాన్ రూ.9.75 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్పాడు. ఈ మూవీ ఒక్క హిందీలోనే ఓపెనింగ్ డే బుధవారం రూ.55 కోట్లు, గురువారం 68 కోట్లు, శుక్రవారం 38, శనివారం 51.50 కోట్లు,ఆదివారం58.50 కోట్లు వచ్చాయి.
దీపిక పదుకొణె హీరోయిన్గా నటించిన ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించాడు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించగా.. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు.