పఠాన్ కోట్ దాడి సూత్రధారి లతీఫ్​హతం

పఠాన్ కోట్ దాడి సూత్రధారి లతీఫ్​హతం
  • పాక్ లోని ఓ మసీదులో దుండగుల కాల్పులు

న్యూఢిల్లీ: పఠాన్‌‌కోట్ ​టెర్రర్  దాడికి ప్రధాన కుట్రదారు, మోస్ట్​ వాంటెడ్​ టెర్రరిస్టు షాహిద్ లతీఫ్ పాకిస్తాన్‌‌లో హత్యకు గురయ్యాడు. సియాల్​కోట్​లోని ఓ మసీదులో లతీఫ్​పై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్​ గాయాలతో లతీఫ్​ అక్కడికక్కడే మృతి చెందాడని పాక్ పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు బైక్​పై పరారయ్యారని చెప్పారు. స్థానిక టెర్రరిస్టుల పనే అయుంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మసీదులో లతీఫ్​ కొంతకాలంగా మౌల్వీగా పనిచేస్తున్నట్లు తెలిపారు.