- పాక్ లోని ఓ మసీదులో దుండగుల కాల్పులు
న్యూఢిల్లీ: పఠాన్కోట్ టెర్రర్ దాడికి ప్రధాన కుట్రదారు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు షాహిద్ లతీఫ్ పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు. సియాల్కోట్లోని ఓ మసీదులో లతీఫ్పై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో లతీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడని పాక్ పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు బైక్పై పరారయ్యారని చెప్పారు. స్థానిక టెర్రరిస్టుల పనే అయుంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మసీదులో లతీఫ్ కొంతకాలంగా మౌల్వీగా పనిచేస్తున్నట్లు తెలిపారు.