- ఐసోలేషన్ సెంటర్లేక బయటకు పంపిస్తున్న డాక్టర్లు
- రోజుకు 10 మందికి పైగా పేషెంట్ల డిశ్చార్జి
- సెకండ్ వేవ్ వరకు ఉన్న వార్డుని తొలగించిన అధికారులు
- గాంధీ లేకపోతే హోం క్వారంటైన్లో ఉండాలని సూచన
- ఎటు పోవాలో తెలియక సొంతూళ్లకు వెళుతున్న పేషెంట్లు
“ సంగారెడ్డి జిల్లాకు చెందిన ధనుంజయ(66) నరాల నొప్పితో బాధపడుతూ గత నెల 24న ఎర్రగడ్డలోనిఈఎస్ఐ హాస్పిటల్ లో చేరాడు. కరోనా టెస్టు చేస్తే నెగెటివ్రాగా, వెంటనే అడ్మిట్చేసుకుని పలు రకాల టెస్టులు చేసి సర్జరీ కోసం నిమ్స్ కి రెఫర్చేశారు. దీంతో ఈనెల 9న నిమ్స్ లో అడ్మిట్అవగా,14న సర్జరీ చేస్తామని చెప్పారు. ఈరోజు ముందుగా కరోనా టెస్ట్ చేస్తే ధనుంజయకు పాజిటివ్అని రావడంతో డాక్టర్లు సర్జరీ పోస్ట్పోన్ చేశారు. గాంధీకి లేదంటే ఇంట్లో హోం క్వారంటైన్ లో ఉండాలని పంపించారు. పేషెంట్నడవలేని స్థితిలో ఉన్నా ఇంటికి తీసుకెళ్లారు. అతనికి ట్రీట్మెంట్కి వచ్చే ముందు లేని కరోనా హాస్పిటల్లో చేరిన తర్వాతనే సోకింది.’’
“జియాగూడకు చెందిన హేమలత కాళ్లకు సంబంధించిన సర్జరీ కోసం నిమ్స్లో వారం కిందట అడ్మిట్అయింది. సర్జరీకి ఒకరోజు ముందు కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో నెగెటివ్వచ్చాక రావాలని డాక్టర్లు ఆమెని డిశ్చార్జ్చేశారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెని నిమ్స్ నుంచి గాంధీ తీసుకెళ్లారు. హాస్పిటల్కి వచ్చే సమయంతో బాగానే ఉన్నా ఇక్కడకు వచ్చాకనే కరోనా సోకినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ’’
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ లో సర్జరీలకోసం అడ్మిట్అయ్యే పేషెంట్లు కొవిడ్బారిన పడుతున్నారు. థర్డ్వేవ్లో ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసోలేషన్సెంటర్లేక సర్జరీ పేషెంట్లుకు ఇబ్బందులు తప్పడంలేదు. కొవిడ్సెంటర్ఏర్పాటుపై మేనేజ్మెంట్ కూడాపట్టించుకోవడంలేదు. ఫస్ట్, సెకండ్ వేవ్ టైమ్లో 200 బెడ్స్తో ఐసోలేషన్సెంటర్ఏర్పాటు చేసి ట్రీట్ మెంట్అందించారు. ప్రస్తుతం ఎలాంటి ఫెసిలిటీ కల్పించడంలేదు. పలు రకాల ట్రీట్ మెంట్లు, సర్జరీలకు వచ్చి కరోనా బారిన పడితే డాక్టర్లు పట్టించుకోకుండా నెగెటివ్వచ్చాక రావాలని డిశ్చార్జీ చేసి పంపిస్తున్నారు. దీంతో చేసేదేమి కుటుంబ సభ్యులు తమవారిని తీసుకెళ్లిపోతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ఆస్పత్రులకు పోతున్నారు. కొందరు గాంధీలో జాయిన్అయితున్నారు. చాలామంది హోం ఐసోలేషన్ లో ఉంటామని సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వేరే చోటకు రెఫర్ చేయకుండా గతంలో మాదిరిగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తే జిల్లాల నుంచి వచ్చే పేద రోగులకు ఇబ్బందులు తప్పుతాయి. దీనిపై నిమ్స్ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. నిమ్స్ వైద్య సిబ్బందికి కేవలం 30 బెడ్స్ మాత్రమే ఉంచారు. అవి కూడా 15 రోజులుగా ఫుల్గానే ఉంటుండగా ప్రస్తుతం స్టాఫ్ కరోనా వచ్చినా ఇతర హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
రోజూ పది మందికిపైగా డిశ్చార్జీ
పలు రకాల ట్రీట్మెంట్లకు నిమ్స్లో అడ్మిట్అయ్యే పేషెంట్లలో రోజూ10 మందికిపైగా పాజిటివ్వస్తుండగా సర్జరీ చేయకుండానే డిశ్చార్జీ చేస్తున్నారు. కాళ్లు, చేతులు, నరాలు, బ్రెయిన్తో పాటు గుండె తదితర వ్యాధులకు సంబంధించిన పేషెంట్లని కూడా పంపిస్తున్నారు. ఐసీయూలో నడవలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్ కు కూడా ఐసోలేషన్ ఫెసిలిటీ కల్పించడంలేదు. గాంధీకి లేకపోతే ప్రైవేట్హాస్పిటల్స్కు లేదంటే ఇంటికి తీసుకెళ్లమని సూచిస్తున్నారు. నెలరోజులుగా కరోనాతో 200 మందికిపైగా పేషెంట్లను సర్జరీలు చేయకుండానే డిశ్చార్జీ చేశారు.
ఆస్పత్రిలో చేరినంక పాజిటివ్
ఆస్పత్రిలో పేషెంట్అడ్మిట్అయ్యే ముందు కరోనా టెస్ట్చేస్తే నెగెటివ్వస్తోంది. సర్జరీ చేయాల్సిన రోజున ముందుగా మళ్లీ కరోనా టెస్ట్చేస్తే నెగెటివ్ వస్తుంది. దీంతో సర్జరీలు క్యాన్సిల్చేసి నెగెటివ్ వచ్చాకే రావాలంటూ పేషెంట్లను బయటకు పంపుతున్నారు. అడ్మిట్అయ్యే వారిలో10 శాతం మంది పేషెంట్లకు ఆస్పత్రిలోనే కరోనా సోకుతోంది. సర్జరీ చేయించు కోకుండానే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్, సూపరింటెండెంట్ నో రెస్పాండ్
నిమ్స్ లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటుపై ఆస్పత్రి డైరెక్టర్, సూపరింటెండెంట్లను కలిసేందుకు గురువారం వెళ్లగా ఇద్దరూ లీవ్లో ఉన్నట్లు వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. ఫోన్లో సంప్రదించినా రెస్పాండ్కాలేదు. డ్యూటీ ఆర్ఎంఓని కాంటాక్ట్అవగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయలేదని చెప్పారు. పేషెంట్లను గాంధీకి తీసుకుపోవాలని, లేదంటే హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచిస్తున్నామని తెలిపారు.
ఐసోలేషన్ వార్డు పెట్టాలె
నాన్నని సర్జరీ కోసం నిమ్స్లో చేర్చాం. ఈనెల14న అపాయింట్మెంట్ఇచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటలకు కరోనా పాజిటివ్వచ్చిందని సర్జరీ పోస్ట్ పోన్ చేస్తున్నామని డాక్టర్చెప్పారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డు లేదని, గాంధీకి వెళ్లాలని లేదంటే హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించి పంపారు. నాన్న నడవలేని స్థితిలో ఉండగా, తప్పదనుకుని ఇంటికి తీసుకెళ్తున్నాం. - రమేశ్, పేషెంట్ కుమారుడు