
ఆసిఫాబాద్, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయమని ఆసిఫాబాద్కొత్త ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు మెదక్కు బదిలీ కాగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆసిఫాబాద్కు బదిలీపై వచ్చారు. గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.