
వికారాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి గాంధీభవన్ లో ఈ నెల16న మధ్యాహ్నం12 గంటలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు.