పవన్​ కళ్యాణ్​ గోదావరి జిల్లాల పర్యటన ... ఎప్పుడంటే....

పవన్​ కళ్యాణ్​ గోదావరి జిల్లాల పర్యటన ... ఎప్పుడంటే....

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన ప్రారంభించనున్నారు. 17వ తేదీన పర్యటన ముగుస్తుంది.తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతోనూ పర్యటనలో భాగంగా పవన్ భేటీ అవుతారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులతోనూ సమావేశమవుతారు.

నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య సహృద్భావ వాతావరణం కొనసాగడానికి సూచనలు చేశారు. పవన్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలి దశలో ముఖ్య నాయకులు, ప్రభావశీలురు, ముఖ్యులతో సమావేశాలు ఉంటాయి. రెండోసారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు,వీర మహిళల సమావేశాలలో పాల్గొంటారు.మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఎన్నికల ప్రచారం చేపట్టేనాటికి పవన్ మూడుమార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.