
ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. చారిత్రక నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీకి అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసి.. సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇపుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్.
సైరా నరసింహారెడ్డి సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని తెలిపింది మూవీ యూనిట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విజయగాథను పరిచయం చేసేలా.. పవన్ కల్యాణ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ను అందించారు. చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి సమక్షంలో పవన్ కల్యాణ్ చెప్పిన డబ్బింగ్ ఫొటోలు విడుదలయ్యాయి. ఈ స్టిల్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.