ఏడేళ్ల క్రితమే వేదాళం రీమేక్.. హీరోగా పవన్ కళ్యాణ్

ఏడేళ్ల క్రితమే వేదాళం రీమేక్.. హీరోగా పవన్ కళ్యాణ్

సినీ ఇండస్ట్రీలో ఒకరికోసం అనుకున్న కథలను వేరే హీరోలు ఒకే చేసి చేయడం జరుగుతూనే ఉంటుంది. అలా చేసిన వాటిలో కొన్ని సినిమాలు హిట్ అవగా..  మరికొన్ని ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలేకపోతాయి. వాటికి కారణాలు కూడా అనేకం. ఇక తాజాగా మెగాస్టార్ హీరోగా వచ్చిన భోళా శంకర్(Bhola shankar) సినిమా విషయంలో అదే జరిగింది. 

2015లో అజిత్(Ajith) హీరోగా వచ్చిన వేదాళం రీమేక్ గా వచ్చింది భోళా శంకర్. శివ(Shiva) దర్శకత్వలో వచ్చిన వేదాళం(Videlam) తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సినిమాను రీమేక్ చేయడానికి తెలుగు మేకర్స్చాలా ఇంట్రెస్ట్ చూపించారు. నిజానికి వేదాళం రీమేక్ ను 2015లోనే హీరో పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో రీమేక్ చేయాలని భావించారు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం. దర్శకుడు నేసన్(Neson) ను కూడా ఈ ప్రాజెక్టు కోసం సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రేపో మాపో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది అనుకునే సమయంలో అనుకోకుండా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఇక దాదాపు ఏడు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి వేదాళం సినిమాను రీమేక్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. నిజానికి 2015లోనే వేదాళం సినిమాకు రీమేక్ చేసి ఉంటె రిజల్ట్ వేరేలా ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.