
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ మరికొన్ని గంటల్లో దర్శనం ఇవ్వనుంది. రేపు (సెప్టెంబర్ 25) థియేటర్స్కి రానున్న ఈ మూవీ ప్రీమియర్స్ ఇవాళ (సెప్టెంబర్ 24న) ప్రదర్శించనున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రీమియర్తో పాటుగా రెగ్యులర్ షోస్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి.
ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ దాదాపు రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇక అందరి నిరీక్షణకు నేటితో ఓజీ సాలిడ్ విందు ఇవ్వనుంది. అయితే.. ఇంతటి భారీ అంచనాల నడుమ వస్తున్న ఓజీ, రెండు తెలుగు రాష్ట్రాలల్లోనే కాకుండా దేశ, విదేశాల్లో చేసిన బిజినెస్ లెక్కలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలపై ఓ లుక్కేద్దాం!!!
ఓజీ బడ్జెట్:
పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా ‘ఓజీ’ భారీ బడ్జెట్తో తెరకెక్కింది. సుజీత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సుమారు రూ.250 కోట్లతో నిర్మించారు. ఈ మూవీలో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ తోపాటు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, ఉపేంద్ర, అర్జున్ దాస్ లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు.
ఓజీ బిజినెస్ & టార్గెట్:
పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్గా నటించిన ‘ఓజీ’ అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ జరుపుకుంది. పవన్ నటించిన లాస్ట్ మూవీ వీరమల్లు థియేట్రికల్ రైట్స్ రూ.126 కోట్ల మేరకు జరిగితే, ఓజీ వరల్డ్వైడ్ థియేటరికల్ రైట్స్ అంతకు రెట్టింపుతో జరుపుకుంది. మొత్తం వరల్డ్వైడ్గా ఓజీ సుమారు రూ.193.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also read:-హైదరాబాద్లో OG సినిమా బ్లాక్ టికెట్ల దందా.. ఒక ప్రముఖ నిర్మాత ఆఫీస్ ముందే నిర్వాకం
ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం ఓజీ భారీ బిజినెస్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం థియేట్రికల్ రైట్స్ రూ.102 కోట్లు, నైజాంలో రూ.55 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మూవీ బ్రేక్ ఈవెన్ చేయాలంటే.. దాదాపు రూ. 200 కోట్ల షేర్.. రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా హక్కులను ఉత్తరాంధ్ర, నైజాంలో= దిల్ రాజు సొంతం చేసుకోగా.. సీడెడ్లో= నాగవంశీ దక్కించుకున్నారు.
థియేట్రికల్ బిజినెస్:
ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లు,
సీడెడ్లో రూ.22 కోట్లు,
నైజాం రైట్స్ రూ.55 కోట్లు,
తెలుగు రాష్ట్రాల్లో= రూ.157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ జరిగింది.
కర్ణాటక, కేరళ, తమిళనాడు హక్కులు రూ.11 కోట్లు
నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్= 2.9 మిలియన్ డాలర్లు అంటే..రూ.25.5 కోట్ల రూపాయల మేర జరిగింది.
యూఎస్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాలు రూ.157కోట్లు, + కర్ణాటక, కేరళ, తమిళనాడు రూ.11కోట్లు, + ఓవర్సీస్ రూ.25.5కోట్లు, బిజినెస్ లెక్కలు కలుపుకుంటే = వరల్డ్వైడ్గా ఓజీ సుమారు రూ.193.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.