
హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ ఉన్నా 24 గంటల పాటు ఎక్కడా కరెంటు పోకుండా సరఫరా చేస్తున్నామని, అలాగే ఫోన్లకు మెసేజ్ ల ద్వారా వచ్చే బిల్లులను ఆన్లైన్లో కట్టాలని విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ఈ క్లిష్ట సమయంలో విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు . సోమవారం మింట్కాం పౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, టీ ఎస్ఎస్పీడీసీఎల్సీఎండీ రఘుమారెడ్డి తో కలిసి మంత్రి మాట్లాడారు. ఇంటింటికీ వచ్చి మీటరు రీడింగ్ తీసే అవకాశం లేనందున ఈఆర్సీ ఆదేశం మేరకు గతేడాది మార్చి నెల బిల్లులను ఫోన్లకు మెసేజ్ చేస్తున్నామన్నారు.