పేటీఎంకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ షాక్‌ ‌‌‌‌‌‌‌.. షేర్లు 20 శాతం క్రాష్​

పేటీఎంకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ షాక్‌ ‌‌‌‌‌‌‌.. షేర్లు 20 శాతం క్రాష్​

న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్  డిపాజిట్లు సేకరించడంపై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రిస్ట్రిక్షన్ల  పెట్టడంతో పేటీఎం షేర్లు గురువారం 20 శాతం క్రాష్​ అయ్యి లోవర్ సర్క్యూట్ టచ్ చేశాయి. రూ.609 దగ్గర ముగిశాయి. పేటీఎం ఫాస్టాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాలెట్లు వంటి వాటికి కస్టమర్లు మనీని ఫిబ్రవరి 29 నుంచి  యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడాన్ని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ నియంత్రించింది. దీంతో కంపెనీ ఆపరేషనల్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడాదికి  రూ.300 – 500 కోట్ల  తగ్గే ఛాన్స్ ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 41 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగాయి. పీపీబీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌97 కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఓసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) (పేటీఎం పేరెంట్ కంపెనీ) కు 49 శాతం వాటా ఉంది. ఈ కంపెనీని సబ్సిడరీగా కాకుండా అసోసియేట్ కంపెనీగా వన్97 కమ్యూనికేషన్స్ చూస్తోంది. ‘పేమెంట్ కంపెనీగా ఓసీఎల్ వివిధ బ్యాంకులతో కలిసి పనిచేస్తోంది. ఇతర బ్యాంకులతో కలిసి పని చేయడం స్టార్ట్ చేశాం.  ఇతర బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టనర్లకు మారడాన్ని వేగవంతం చేస్తాం’ అని తెలిపింది.