సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేద్దాం

సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేద్దాం

హైదరాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేద్దామని, ఆత్మహత్యలు చేసుకోవద్దని వీఆర్​ఏలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. వీఆర్​ఏల ఉద్యమానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేస్కేల్ అమలు చేయడం లేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న అశోక్ కుటుంబ సభ్యులతో, వీఆర్ఏ సంఘ నేతలతో  రేవంత్ ఫోన్​లో మాట్లాడారు. వీఆర్ఏ సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడి అసెంబ్లీలో చర్చించేలా కృషి చేస్తానన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు వీఆర్‌‌‌‌‌‌‌‌ఏల సమస్యలపై లేఖ రాస్తాననన్నారు. ఇప్పటివరకు 22 మంది వీఆర్‌‌‌‌‌‌‌‌ఏ లు చనిపోయారని గుర్తు చేశారు.