అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ సవాల్

అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ సవాల్

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో ఒవైసీ పార్టీ ఇచ్చాడని.. దర్గాకి రమ్మన్నా వస్తా. భాగ్యలక్ష్మి టెంపుల్ రమ్మన్నా వస్తా.. ఒవైసీ మసీదులో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు.

అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల ఫైజమా ఉందని అనుకున్నా.. శర్వాణీ కింద కాకీ నిక్కర్ ఉందని అర్థమైంది.. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిస్టర్ చదివిస్తే.. ఒవైసీ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్దతుగా ఉన్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

గోషాల్ మహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ పై ఎంఐఎం పార్టీ నుంచి అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడేందుకు ఒవైసీ అబద్ధాలు చెబుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.