తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం జరుగుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే వానాకాలం పంట సమయంలో లక్ష క్వింటాళ్లు స్కాం జరిగిందంటూ ట్వీట్ చేశారు. ఇక రాష్ట్రంలో స్కాం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చంటూ విమర్శించారు. కేసీఆర్ కి తెలియకుండానే ఈ స్కాం జరుగుతుందా అని రేవంత్ ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణకు విచారించకుండా ఆపుతుంది ఎవరంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం యధేచ్ఛగా నడుస్తోంది.
— Revanth Reddy (@revanth_anumula) April 16, 2022
వానాకాలం పంటలో నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు పందికొక్కుల్లా బొక్కారంటే రాష్ట్రం మొత్తం మీద స్కాం ఏ స్థాయిలో ఉంటుంది?
కేసీఆర్ కు తెలియకుండా ఇది సాధ్యమా!? సీబీఐ విచారణకు ఆదేశించకుండా బీజేపీని ఆపుతున్నదెవరు? pic.twitter.com/iFNVzoAqSj
మరిన్ని వార్తల కోసం