
హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి మరంగంటి రాజేందర్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ యూఐలో, యువజన కాంగ్రెస్ విభాగంలో రాజేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. లేకపోయినా నిజాయితీగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని రాజేందర్ రెడ్డి హై కమాండ్ను కోరారు. ఖైరతాబాద్అసెంబ్లీ సీటు తనకు కేటాయిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఓడించి.. కాంగ్రెస్ను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్రెడ్డి వెంట కాంగ్రెస్ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి, నాయకులు రమాకాంత్రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.