ముక్క కోసం ఎగబడ్డరు..కిటకిటలాడిన మటన్, చికెన్ సెంటర్లు

ముక్క కోసం ఎగబడ్డరు..కిటకిటలాడిన మటన్, చికెన్ సెంటర్లు

లాక్​డౌన్.. సోషల్ డిస్టెన్స్​.. కరోనా భయం.. ముక్క ముందు పక్కకెళ్లిపోయాయి.  ఎప్పట్లాగే ఈ సండే కూడా జనమంతా మటన్​ కోసం, చికెన్ కోసం​, చేపల కోసం ఎగబడ్డరు. రాజధాని హైదరాబాద్​ మొదలుకొని హుజురాబాద్​ దాకా ఇదే తంతు. కొన్ని చోట్ల సోషల్​ డిస్టెన్స్​ పాటించినా చాలా చోట్ల నాన్​వెజ్​ షాపుల ముందు గుంపులు గుంపులుగా గుమికూడి కొనుక్కెళ్లారు. వీళ్లలో చాలామంది మాస్క్​లు కూడా వేసుకోలేదు. మన దగ్గరే కాదు చాలా రాష్ట్రాల్లో ఇవే సీన్లు. పై ఫొటో హుజురాబాద్​లో దించింది. ఈ పక్కన ఉన్నది చెన్నై కాశిమేడులో ఫిష్​ మార్కెట్​ దగ్గర దించిన ఫొటో.

సండే నాన్​వెజ్​ తినాలనే యావలో జనం లాక్​డౌన్ సంగతి మరిచిపోయిన్రు. ముఖ్యంగా అర్బన్​ ఏరియాల్లో మటన్​, చికెన్​ షాపులు తెరవంగనే  గుంపులుగుంపులుగా ఎగబడ్డరు. నగరాలు, పట్టణాల్లో చాలాచోట్ల జనం సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. రెడ్​ అలర్ట్ అమలవుతున్న కరీంనగర్​ సిటీలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు, ఆఫీసర్లు రంగంలోకి దిగిన్రు. అందరినీ సోషల్​ డిస్టెన్స్​ పాటించేలా చర్యలు తీసుకున్నరు. నిబంధనలు పాటించని షాపుల యజమానులకు జరిమానాలు విధించిన్రు. మరోసారి ఇలా జరిగితే సీజ్​ చేస్తమని హెచ్చరించిన్రు. ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ఫిర్యాదు అందడంతో భద్రాద్రి  కొత్తగూడెంలోని రెండు షాపులను ఆఫీసర్లు సీజ్​ చేసిన్రు. పాల్వంచలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ చేపల వ్యాపారిపై కేసు నమోదు చేసిన్రు. నిర్మల్‌‌‌‌ పట్టణంలో సోషల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ పాటించకుండా మటన్‌‌‌‌, చికెన్‌‌‌‌ అమ్మిన 23 దుకాణాలకు మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్లు రూ.32 వేల ఫైన్‌‌‌‌ వేసిన్రు. అన్ని చోట్ల పోలీసులు గట్టి వార్నింగ్​ ఇచ్చిపోయిన్రు. కాగా, ఇదే అదనుగా మటన్‌‌‌‌ను రూ.700 వరకు, చికెన్‌‌‌‌ను రూ.210 వరకు విక్రయించిన్రు.

గుంపుగా కల్లుతాగుతున్న 25 మందిపై కేసు