
- కంపెనీ, డీలర్ పై కేసు నమోదు
శాయంపేట, వెలుగు: రైతులు కొనుగోలు చేసే పురుగుల మందుల్లో కంపెనీలు, డీలర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు లీగల్మెట్రాలజీ ఆఫీసర్లు గుర్తించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలోని శ్రీవెంకటేశ్వర ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్షాపులో ట్రైకమ్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పురుగుమందు సీల్ బాటిల్లో 250 ఎంఎల్ బదులు150 ఎంఎల్నింపి అమ్ముతున్నట్లు సూరంపేటకు చెందిన రైతు రమేశ్ గుర్తించి గత జులై 31న ఏఓకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఓ గంగా జమున అదేరోజు షాపులో తనిఖీ చేసి 23 బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడికి నోటీసులు ఇచ్చారు.
అనంతరం లీగల్మెట్రాలజీ డిపార్టుమెంట్కు సమాచారం ఇచ్చారు. సోమవారం లీగల్మెట్రాలజీ ఆఫీసర్లు వెళ్లి తనిఖీ చేసి ట్రైకమ్ అగ్రి ప్రైవేటు లిమిటెడ్కంపెనీ బాటిళ్లను ప్రొసీజర్ మేరకు మందు ఎంత ఉందనేది కొలిచారు. 250ఎంఎల్బదులు150 ఎంఎల్గా ఉన్నట్టుగా గుర్తించారు. షాపులోని 23 బాటిళ్లను సీజ్ చేసి కంపెనీపై, డీలర్ పైన కేసు నమోదు చేయనున్నట్టు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ విశ్వేశ్వర్ తెలిపారు. రైతులు కూడా పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు సరి చూసుకోవాలని సూచించారు.