
వరి, పత్తి పంటలకే అధిక వాడకం
వరికి 28 శాతం, పత్తికి 20 శాతం
రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వాడకం
మితిమీరుతున్న కెమికల్స్… రూల్స్ పాటించని కంపెనీలు
ఇండియాలో పెస్టిసైడ్స్ మార్కెట్విలువ రూ. 20 వేల కోట్లు
పురుగు మందులపై కొత్త చట్టం తేనున్న కేంద్రం
హైదరాబాద్, వెలుగు: పంట ఏదైనా పురుగుమందు కొట్టకుంటే ఇప్పుడు పని అయితలే. వీటి వాడకం ఏటేటా ఎక్కువైపోతోంది. మరోవైపు కెమికల్స్ఉండాల్సిన కన్నా ఎక్కువ మోతాదులతో మందులను తయారు చేస్తున్నాయి కంపెనీలు. దాని వల్ల చీడపీడలు చావడం అటుంచి, రివర్స్లో రైతుల ప్రాణాల మీదకొస్తోంది. పండిన పంటల్లో విషాలు కలిసిపోయి జనానికి నష్టం కలిగిస్తున్నాయి. పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి. పశుపక్షాదులను చంపేస్తున్నాయి. అందుకే ఆ పెస్టిసైడ్స్అతి వాడకానికి చెక్పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెస్టిసైడ్స్మేనేజ్మెంట్బిల్లును తీసుకొస్తోంది.
దేశంలో వరి, పత్తికే సగం పెస్టిసైడ్స్
భూమిలో సారాన్ని తెలుసుకునే పరీక్షలు చేయించాకే పురుగు మందులుగానీ, ఎరువులు గానీ వాడాల్సి ఉంటుంది. దానికి మించి వాడితే భూమిలోని సారం తగ్గిపోవడంతో పాటు పంటల దిగుబడి కూడా పడిపోతుంది. కానీ, రాష్ట్రంలోనూ పురుగు మందుల వాడకం ఎక్కువవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2014–15 సంవత్సరంలో పురుగుమందులు, ఎరువుల వాడకం 2,805.71 టన్నులుండగా, 2018–19 నాటికి 4,894 టన్నులకు పెరిగింది. ఈ ఏడాది 5 వేల టన్నులను దాటేసింది. వరంగల్రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉందని అధికారుల పరిశీలనలో తేలింది. వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలకే ఎక్కువగా కొడుతున్నారని వెల్లడైంది. దేశమంతటా అన్ని పంటలకు కొడుతున్న పురుగుమందుల్లో 26 నుంచి 28 శాతం మందులు వరి పంటకే కొడుతున్నారు. పత్తికి18 నుంచి 20 శాతం వరకు వాడుతున్నారు. మందులపై రైతులకు తగిన అవగాహన లేకపోవడంతో అవసరం లేకున్నా అంటగడుతున్నారు కొందరు షాపులోళ్లు. కలుపును చంపేసే గ్లైఫోసేట్ను నిషేధించినా, యథేచ్ఛగా అమ్ముతున్నారు.
20 వేల కోట్ల వ్యాపారం
పెస్టిసైడ్స్మార్కెట్లో ఇండియాది ప్రపంచంలోనే నాలుగో స్థానం. దేశంలో పురుగుమందుల వ్యాపారం విలువ రూ.20 వేల కోట్లపైనే. మొత్తం 292 కంపెనీలు రిజిస్టర్ కాగా, 104 కంపెనీలు మందులను తయారు చేస్తున్నాయి. అందులో టాప్ 3 కంపెనీల వాటానే 57 శాతం. పురుగు మందుల్లో నిర్ణీత మోతాదుల్లోనే కెమికల్స్వాడాల్సి ఉంటుంది. కానీ, కంపెనీలు అవేవీ పట్టించుకుంటలేవు. మోతాదును మించి కెమికల్స్తో తయారు చేస్తున్నాయి. పురుగుమందుల షాపులు నడిపేందుకు అగ్రికల్చర్ లేదా కెమిస్ట్రీలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. కానీ, చాలా సందర్భాల్లో ఆ రూల్స్ పాటించట్లేదు.
వేలాది మంది రైతులు బలైతున్నరు..
కంపెనీలు ఇష్టారీతిగా ఎక్కువ కెమికల్స్ తో తయారు చేసి అమ్ముతున్న పురుగుమందులను పొలాలకు కొడుతున్న రైతులు వాటి ఎఫెక్ట్ పడి చనిపోతున్నారు. నేషనల్క్రైమ్రికార్డ్స్బ్యూరో లెక్కల ప్రకారం 2014లో 7,365 మందిపై పురుగుమందుల ఎఫెక్ట్పడగా, 5,915 మంది చనిపోయారు. 2015లో కేసుల సంఖ్య 7,672 కాగా, చనిపోయిన వాళ్లు 7,060 మంది ఉన్నారు. దీన్ని బట్టి పురుగు మందులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తం పురుగుమందులు, ఎరువుల వాడకంలో 8 రాష్ట్రాల వాటానే 70 శాతం. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లోనే విపరీతమైన వాడకం ఉంది. కొన్ని కంపెనీల మందులను వేరే దేశాలు నిషేధించినా, మన దగ్గర మాత్రం ఇంకా ఉన్నాయి. తయారీ, దిగుమతి, వాడకం, అమ్మకం, రవాణా వంటి వాటిని నియంత్రించేందుకు1968లో చేసిన ఇన్సెక్టిసైడ్యాక్ట్వీటిని అడ్డుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త రూల్స్తో కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
రాష్ట్రంలో పురుగు మందుల వినియోగం
ఏడాది వాడకం (టన్నుల్లో)
2014–15 2,805.71
2015–16 992.88
2016–17 3,436.39
2017–18 4,865.74
2018–19 4,894
2019–20 5,000
పెస్టిసైడ్స్ ముసాయిదా బిల్లులోని అంశాలు
పురుగుమందుల సమాచారం మొత్తం డీలర్ల నుంచి రైతులకు అందేలా చర్యలు
సేంద్రియ పురుగుమందుల వాడకానికి ప్రోత్సాహం
పురుగుమందుల ప్రచారంపై నియంత్రణ
రూల్స్ మీరిన కంపెనీలకు రూ.25 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఫైన్, ఐదేళ్ల వరకు జైలు
నకిలీ పెస్టిసైడ్స్వల్ల నష్టపోయిన రైతుల కోసం సెంట్రల్ఫండ్ ఏర్పాటు (కంపెనీలపై వేసే ఫైన్లకు కేంద్రం కొంత కలుపుతుంది)
కంపెనీల రిజిస్ట్రేషన్, కెపాసిటీపై ఎప్పటికప్పుడు సమీక్ష
మనుషులు, జంతువులు, పర్యావరణంపై తమ పెస్టిసైడ్స్ చూపే ప్రభావం గురించి కంపెనీలు రిజిస్ట్రేషన్ ఫామ్లోనే చెప్పాలి.