టెన్త్ ​స్టూడెంట్​తో పీఈటీ అసభ్య ప్రవర్తన

టెన్త్ ​స్టూడెంట్​తో పీఈటీ అసభ్య ప్రవర్తన
  • చితకబాదిన తల్లిదండ్రులు
  • పోలీస్​ స్టేషన్​లో కంప్లయింట్​
  • ప్రిన్సిపాల్, పీఈటీ సస్పెన్షన్​ 

నారాయణ్ ఖేడ్, వెలుగు : ఓ పీఈటీ టెన్త్ క్లాస్ స్టూడెంట్​తో అసభ్యంగా ప్రవర్తించడంతో వారి పేరెంట్స్, గ్రామస్తులు చితకబాదారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపుర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో సంగ్రామ్ పీఈటీగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం స్కూల్ ప్రారంభమైన తర్వాత ఓ టెన్త్ క్లాస్ అమ్మాయిని బిల్డింగ్​పైకి తీసుకువెళ్లాడు. అక్కడ మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడంతో కింది నుంచి తోటి విద్యార్థులు గమనించారు.

విషయాన్ని స్టూడెంట్స్​తో పాటు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్​ చేసి చెప్పింది. దీంతో అక్కడికి వచ్చిన వారు గ్రామస్తులతో కలిసి సంగ్రామ్ ను చితకబాది పీఎస్​లో కంప్లయింట్​ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఈవో వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ గురునాథ్ తో పాటు పీఈటీని సస్పెండ్ చేశారు.