24 రోజుల్లో రూ.3.28 పెరిగిన పెట్రోల్ ధర

24 రోజుల్లో రూ.3.28 పెరిగిన పెట్రోల్ ధర

పెట్రోల్ ధరలు మళ్లీ పైపైకి పాకుతున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. రోజు విడిచి రోజు ధర పెంచుతున్న ఆయిల్ కంపెనీలు.. గురువారం లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్ పై 25 పైసలు పెంచాయి. దాంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.36 పైసలు, డీజిల్ ధర రూ. 92.24 పైసలకు చేరింది. కాగా.. గత 24 రోజుల్లో పెట్రోల్ ధరలను ఆయిల్ కంపెనీలు 14 సార్లు పెంచడం గమనార్హం. ఈ 24 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.3.28పైసలు, డీజిల్ పై రూ.3.88పైసలు పెరిగింది. రేట్ల పెంపుతో దాదాపు అన్ని మెట్రో సిటీల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వందకు చేరుకున్నాయి.