భారత్లో తమ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకం కోసం పెట్టిన దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ తెలిపింది. ఫైజర్ భారత్లో కంటే ముందే యూకే మరియు బహ్రెయిన్లో ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు పొందింది. అంతేకాకుండా భారత్లో ఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసిన మొదటి కంపెనీ ఫైజర్ కావడం గమనార్హం.
భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ప్రతినిధులు ఫిబ్రవరి 3న పాల్గొన్నారు. ఆ సమావేశంలో రెగ్యులేటరీ వ్యాక్సిన్ యొక్క అదనపు సమాచారాన్ని కోరింది. ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి రావడంతో.. మరింత సమాచారాన్ని జతచేసి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) కోసం మరోసారి దరఖాస్తు చేస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
For More News..