రూ.820 కోట్లు సేకరించిన ఫోన్​పే

రూ.820 కోట్లు సేకరించిన ఫోన్​పే

న్యూఢిల్లీ: వాల్‌‌‌‌మార్ట్​కు చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్​పే.. అమెరికాకు చెందిన​ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్,  దాని పెట్టుబడిదారుల నుంచి 100 మిలియన్లను (దాదాపు రూ.820 కోట్లు) సేకరించింది. ఫోన్​పేకు ఇప్పటి వరకు పలు ఇన్వెస్టర్ల నుంచి 750 మిలియన్​ డాలర్లు అందాయి. బిలియన్​ డాలర్ల మూలధన సేకరణలో భాగంగా ఈ కొత్త నిధులను ఇన్వెస్టర్లు అందించారు. జనరల్ అట్లాంటిక్ ఈ ఏడాది జనవరిలోనూ ఫోన్​పేలో 350 మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టింది. 12 బిలియన్​ డాలర్ల వాల్యుయేషన్‌‌‌‌లో బిలియన్​ డాలర్లను విడతలుగా సమీకరిస్తునట్లు ఫోన్​పే జనవరిలో ప్రకటించింది.

అప్పటి నుంచి ఫిన్‌‌‌‌టెక్ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్‌‌‌‌మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్​ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, తన అతిపెద్ద వాటాదారు–వాల్‌‌‌‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సేకరించింది. ఈ నిధులను ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్, లెండింగ్, స్టాక్‌‌‌‌బ్రోకింగ్, అకౌంట్ అగ్రిగేటర్‌‌‌‌ వంటి కొత్త వ్యాపారాలను నిర్మించడానికి, విస్తరించడానికి ఉపయోగించనుంది. యూపీఐ లైట్​తోపాటు యూపీఐ క్రెడిట్‌‌‌‌ కోసం ఇన్వెస్ట్​ చేయనుంది.తాజాగా ఫోన్​పే కొత్త కన్జూమర్​–ఫేసింగ్ అప్లికేషన్ ‘పిన్‌‌‌‌కోడ్‌‌‌‌’ను ప్రారంభించింది. ఆన్​లైన్​ బిజినెస్​ కోసం కేంద్రం డెవెలప్​ చేస్తున్న ఓపెన్ నెట్‌‌‌‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌కు దీనిని ఇంటిగ్రేట్​ చేయనుంది.