న్యూఢిల్లీ: యునైటెడ్అరబ్ఎమిరేట్స్(యూఏఈ)కు వెళ్లే ఫోన్పే యాప్ వినియోగదారులు ఇప్పుడు యూపీఐని ఉపయోగించి మష్రెక్ నియోపే టెర్మినల్స్లో డబ్బు చెల్లించవచ్చు. ఈ సదుపాయం అనేక రకాల రిటైల్ స్టోర్లు, డైనింగ్ అవుట్లెట్లు, పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.
భారత్లో చేసినట్టే చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఈ లావాదేవీలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరుగుతాయి. లావాదేవీలు రూపాయల్లోనే జరుగుతాయి. యూఏఈ మొబైల్ నంబర్లను కలిగి ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఫోన్పే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.