భారత్ రాష్ట్ర సమితి పార్టీకి హైదరాబాద్లోని కోకాపేటలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి 11 ఎకరాలు కేటాయించడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ జులై 10న హైకోర్టులో పిల్ వేసింది. పిటిషనర్ తెలిపినఅందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కోకాపేటలో ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమి ఉంది. దాన్ని అధికార పార్టీకి రూ.3.41 కోట్లకే కేటాయించారు.
అయిదు రోజుల్లో భూ కేటాయింపులు పూర్తి చేశారని.. పార్టీకి ఇది వరకే బంజారాహిల్స్లో కార్యాలయం ఉండగా కొత్తగా అతి తక్కువ ధరకు ఎందుకు కేటాయించారన్నది పిటిషనర్ వాదన. శిక్షణ, ఎక్సలెన్స్ పేరిట బీఆర్ఎస్ భూమి పొందిందని, భూ కేటాయింపు వివరాలు రహస్యంగా ఉంచారని ఆరోపించారు. తీసుకున్న భూమిలో నిర్మాణ పనులు చేపట్టకుండా స్టే ఇవ్వాలని ఎఫ్జీజీ కోరింది.