హైదరాబాద్, వెలుగు: బ్యాటరీ సెల్స్లో వాడే కాథోడ్ మెటీరియల్స్ను తయారు చేసేందుకు హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ఆల్ట్మిన్ ప్రభుత్వ సంస్థ ఏఆర్సీఐతో కలిసి పైలెట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఏఆర్సీఐ హైదరాబాద్ క్యాంపస్లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ (సీఏఎం) లో కీలకమైన లిథియం ఫెర్రస్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్పీ) ను ఇక్కడ తయారు చేస్తారు. ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సుమారు రూ.25 కోట్లను ఇన్వెస్ట్ చేశామని, ఈ పైలెట్ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 10 మెగా వాట్స్ అని కంపెనీ వివరించింది.
త్వరలో పెద్ద ప్లాంట్ను ఏర్పాటు చేసే ప్లాన్లో ఉంది. ఎల్ఎఫ్పీ టెక్నాలజీని ఏఆర్సీఐ డెవలప్ చేసిందని, వీరితో పార్టనర్షిప్ కుదుర్చుకొని ఈ ప్రొడక్ట్లను తయారు చేస్తున్నామని కంపెనీ ఫౌండర్ మౌర్య సుంకవల్లి అన్నారు. దేశ ఈవీ మార్కెట్ విస్తరిస్తోందని, బ్యాటరీ సెల్స్ మెటీరియల్స్కు ఫుల్ డిమాండ్ ఉందని, ప్రస్తుతం వీటి కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించారు. ప్రభుత్వం తెచ్చిన పీఎల్ఐ స్కీమ్తో మరిన్ని కంపెనీలు బ్యాటరీ సెల్స్ మెటీరియల్స్ను తయారు చేయడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. తమ శాంపిల్ ప్రొడక్ట్లను అమర రాజా, ఎక్సైడ్ వంటి కంపెనీలకు పంపుతున్నామని వివరించారు.