
శంషాబాద్, వెలుగు : మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాడుతున్న మహారాష్ట్రకు చెందిన కొందరిని సోదా చేయగా గన్దొరికింది. సీఐ నరసింహ కథనం ప్రకారం..కాటేదాన్ పారిశ్రామికవాడలో ఒక కంపెనీలో ఆదివారం కొంతమంది పేకాడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అనుమానం వచ్చి వారిని చెక్చేయగా ఒకరి దగ్గర లోడ్చేసిన కంట్రీమేడ్ పిస్టల్ దొరికింది.
ఒకవేళ పోలీసులు దాడి చేస్తే తప్పించుకోవడానికి పిస్టల్తెచ్చుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కానీ అలా జరగకపోవడంతో మిగతా కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్ సీజ్ చేసి నలుగురిని అరెస్టు చేశారు. వీరంతా పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారని తెలిసింది.